Saturday 22 June 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 41వ.అధ్యాయము

   
       
  
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

41వ.అధ్యాయము

                                   13.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి పటముయొక్క ప్రాముఖ్యము, మధ్యవర్తులు లేకుండ శ్రీ సాయి సేవ చేసుకొనే విధానము, నిత్య పారాయణకు ఉపయోగపడు గ్రంధాలను గురించి శ్రీ హేమాద్రిపంతు చక్కగా వివరించినారు. 


Friday 21 June 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 40 వ.భాగము

  
 


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

గత పదిహేనురోజులుగా, కాశీ యాత్ర వలన ప్రచురణకు సాధ్యపడలేదు..మా కాశీ యాత్ర విశేషాలను మీకందరికీ త్వరలోనే అందిస్తాను.కాశీ యాత్ర ముగించుకొని 18వ.తారీకున క్షేమంగా చేరుకొన్నాము..బాబాగారు ముందునుంచీ తను ఉన్నానని నిరూపించారు.తను మాయాత్ర కు ఆమోదం తెలుపుతూ ప్రతిక్షణం మాకు యాత్రలో కనపడుతూనే ఉన్నారు..ఆవిశేషాలన్నిటినీ త్వరలోనే అందిస్తాను..కొన్ని అనివార్య కారణాలవల్ల విష్ణుసహస్రనామం శ్లోకాన్ని అందించలేకపోతున్నాను..


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 40 వ.భాగము

                                              12.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి లీలలను చక్కగా వర్ణించినారు.  ఆ లీలలు చదువుతు ఉంటే అటువంటి సంఘటనలు శ్రీసాయి మనకు కలిగించితే ఎంత బాగుండును అనే కోరిక కలుగుతుంది. 



 ఆకోరికను శ్రీసాయి కార్యాచరణలో పెట్టి తన భక్తునికి సంతోషము కలిగించుతారు.  శ్రీసాయి చూపిన లీలలతో సంతోషము పొందిన సాయి భక్తులలో నేను ఒకడిని.  ఈ ఉత్తరములో నేను శ్రీసాయితో పొందిన అనుభవాన్ని వ్రాస్తాను.  శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు, "సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేద భావమును నశింపచేసి, అప్రాప్యమును ప్రాపింప చేయును".  ఈ విధమైన అనుభవాన్ని నేను పొందినాను.  29.01.1992 నాడు సాయి భక్తుడు, నా పినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల సర్వేశ్వర సోమయాజు గారు శ్రీసాయి యొక్క మధ్యాహ్న్న హారతి పూర్తి అయిన పిదప తను మరణ బాధ పడుతూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొని నాతలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందినాను.  శ్రీహేమాద్రిపంతు శ్రీసాయితో తనకు కలిగిన సాయి లీలను వర్ణించినారు.