Wednesday 12 November 2014

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢ రహశ్యాలు - 1

   
          

12.11.2014 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ముందుగా సాయి ప్రేరణ: ఒక్కసారి నామాటని నలుగురితో పంచుకొని చూడు, నిన్ను అమూల్యమైన మార్గదర్శకుణ్ణి చేస్తాను

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢ రహశ్యాలు - 1


ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                   హైదరాబాద్ 

1) ప్రశ్న: శ్రీసాయి సత్ చరిత్ర 10వ.అధ్యాయం. శ్రీసాయి అన్న మాటలు - "బానిసలలో బానిసనగు నేను మీకు ఋణగ్రస్థుడను.  మీయశుధ్ధములో నేను ఒక క్రిమిని"

ఈమాటలకు అర్ధమును తెలపగలరు?

జవాబు: శ్రీసాయి తొమ్మిదవ అధ్యాయము, పదవ అధ్యాయములలో అన్నమాటలు గుర్తు చేసుకొందాము.  "నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటియను ద్వంద్వభావమును, భేదమును విడచి నన్ను సేవింపుము".  "ఎవరైతే ప్రేమతో నాకు భోజనం అర్పించి ఆ శేషభుక్తమును భుజించెదరో వారికి నేను ఋణగ్రస్థుడను" మరి మనము భుజించిన ఆభోజనం మన శరీరములోని పెద్ద ప్రేగులోనికి చేరి మలముగా (యశుధ్ధముగా) మారుతుంది.  మానవ శరీరములోని ప్రాణము పోయిన, మన శరీరము (శవము) లోని మలములోని క్రిములలో ప్రాణము యుంటుంది.  బాబా తాను తన భక్తుల మలములోని ఒక క్రిమిని అని అన్నారు.  ఒకవేళ ఈప్రాణములేని శరీరము (శవము) నకు దహనసంస్కారములు చేయకపోయిన మన శరీరము (శవము) లోని మలములో దాగియున్న క్రిములు వేల సంఖ్యలలో వృధ్ధి చెంది ప్రాణము లేని శరీరమును పంచభూతాలలో కలసి పోయేలాగ చేస్తాయి.  అంటే బాబా మన శరీరము (శవము) లోని మలములో దాగియున్న క్రిమి కదా -

మన ప్రాణము పోయిన శరీరానికి (శవానికి) దహనసంస్కారములు ఎవరు చేయకపోయినా మన అశుధ్ధములో క్రిమిగా యున్న బాబా మన శరీరాన్ని (శవాన్ని) పంచ భూతాలలో కలుపుతారు అని గ్రహించాలి.

జై సాయిరాం 

(రేపు మరొక ప్రశ్న) 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment