Sunday 7 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 26వ. అధ్యాయము

      
         
       
 07.04.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
26వ. అధ్యాయము
                                                   29.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈఉత్తరములో శ్రీసాయిని మానసికముగా ఏవిధముగా పూజించాలి అనేది శ్రీహేమాద్రిపంతు ఆంతరిక పూజా విధానములో వర్ణించినారు.  నిజముగా ఆవిధముగా పూజించాలి అనే తలంపు రాగానే మనసు సంతోషముతో నిండిపోతుంది.  నీవు ఎవరి పాదాలకైనా నమస్కరించు సమయములో శ్రీసాయిని మనసార తలచుకొని అవతలి వ్యక్తిలో శ్రీసాయిని చూస్తూ నమస్కారము చేయి.  ఆ అనుభూతిని, సంతోషాన్ని అనుభవించు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి తనతోటి యోగి యొక్క శిష్యుని చూచి పలికిన పలుకులు ఎంత గంభీరమైనవి.  "ఏమైనను కానిండు, పట్టు విడవరాదు.  నీగురునియందే యాశ్రయము నిలుపుము, ఎల్లపుడు నిలకడగానుండుము.  ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము.  మన అదృష్టము వలన మనము వారి పాదాలను నమ్ముకొన్నాము.  మన సంతోషానికి మనమనసులే సాక్షి.  శ్రీసాయి తనతోటి యోగీశ్వరులను సదా గౌరవించేవారు.  వారి సాంప్రదాయమును మనము గౌరవించాలి.  శ్రీసాయి ఆలోచనలలో ఆత్మహత్య మహాపాపము.  ఆవిషయములో శ్రీసాయి స్వయముగా ఏవిధముగా తన భక్తుడు గోపాలనారాయణ అంబాడేకర్ ను రక్షించినది శ్రీహేమాద్రిపంతు వివరించినారు.  చదివి అర్ధము చేసుకో.  జీవితములో కష్టాలు అనేవి ప్రతి మానవుడికి వస్తాయి.  వాటికి ఆత్మహత్య పరిష్కారము కాదు అంటారు శ్రీసాయి.  "కొడుకు కూడా తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక" అంటారు శ్రీహేమాద్రిపన్తు.  మరి నేను కోరుకొనేది నీవు కూడా శ్రీసాయి భక్తుడుగా మారాలని -  నాకోరిక తీర్చుతావు కదూ.

నీతండ్రి


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment