Tuesday 10 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 ( 5 )




 

11.01.2012  బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్స్లు

సాయి.బా.ని.. డైరీ - 1994 5 . భాగము

05.02.1994

నిన్నటిరోజున కూడ మనసులో చాలా చికాకు కలిగినదిమనసుకు కొంచము సంతోషము కలిగించమని  శ్రీ సాయిని వేడుకొన్నానుశ్రీ సాయి  రాత్రి  కలలో చూపిన దృశ్యము, ఆయన యిచ్చిన సూచనలు మనసుకు సంతోషము కలిగించినది.




1.  సంఘములోని పెద్దమనుషులు స్త్రీల మాదిరిగా గచ్చకాయలు ఆట ఆడుతున్నారునాకు నవ్వు వచ్చినది.

2.  నాయింట శ్రీ శిరిడీ సాయి లీల అమృత భాండాగారము కోసము శ్రీ సాయి వడ్రంగి వారిని పిలిచి అలమారాలు తయారు చేయించుతున్నారు దృశ్యము నాకు సంతోషము కలిగించినది.

3.  శ్రీ సాయి ఒక ముసలివాని రూపములో నా యింట నుయ్యినుండి నీరు తోడి నాయింటికి వచ్చిన సాయి బంధువులకు త్రాగటానికి మంచి నీరుగా యిచ్చి వారి దాహము తీర్చసాగినారునేను ముసలివాని పాదాలకు నమస్కరించినాను.




08.02.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నేను చేయవలసిన మంచి పనులు చెప్పమని వేడుకొన్నానుశ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అంటారు.

1.  నీ తల్లి ఋణము తీర్చుకోవాలి అంటే ఆమె ఆఖరి రోజులలో ఆమెకు ఏలోటు రాకుండ చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు శ్రధ్ధగా చేయి.

2.  నీ స్నేహితులలోను, బంధువులలోను నీవు ఎవరికైన ఋణగ్రస్థుడివి అయితే వారి ఋణము తీర్చుకోవటానికి ప్రయత్నించుఒకవేళ వారి ఋణము తీర్చుకోకుండానే వారు ముందుగా మరణించితే నీవు వారి అంత్యక్రియలకు వెళ్ళివారి ఆత్మలకు ఆఖరి నమస్కారము చేయి.

3.  భార్య వ్యామోహము, పరస్త్రీ వ్యామోహము వదిలించుకో
 
4.  ముఖ్యముగా చెడ్డపనులు చేయకుండ యుండటమే నీవు చేయగల మంచిపని అని గుర్తించు.

10.02.1994

నిన్న రాత్రి శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము నాలో సంతృప్తిని కలిగించినదివాటి వివరాలు.


 "నేను ఒక రైలు యింజను నడుపుతున్నానుఆయింజనులో నేను ఒక్కడినే యున్నానురైలు పట్టలు మీద ఒక గోడ యున్నది.  
 
దూరమునుండి  గోడను చూసి రైలు యింజను వేగము తగ్గించినాను. గోడ తర్వాత పట్టాలు లేవునీవు రైలు యింజనును అక్కడే ఆపివేయవలసియుంటుంది అనే మాటలు వినిపంచసాగినవి యింజను వెనక్కి వెళ్ళే సదుపాయము లేదువేగము తగ్గించి మెల్లిగా నడుపసాగినాను."  దృశ్యము ద్వారా శ్రీ సాయి యిచ్చిన సూచన ఏమిటి అని ఆలోచించినానుబహుశ నా బరువు బాధ్యతలు అనే రైలు యింజను త్వరలో తన గమ్యాన్ని చేరుకోబోతున్నది.  "నీవు రైలు యింజనును పట్టాలు ఆఖరి వరకు నడపగలవుపట్టాలమీద గోడ సంసార బంధాలకు ఆఖరి మజిలీ గోడ దాటిన తర్వాత నీను ఒక్కడివే నీ గమ్యము వైపు నడచుకొంటూ   ముందుకు సాగిపోవాలి" అని శ్రీ సాయి  నన్ను హెచ్చరించుతున్నారు అని భావించినాను.

15.02.1994

నిన్నటిరోజున శ్రీ సాయి నామస్మరణలో గడిపినానుశ్రీ సాయి రాత్రి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.

1.  జీవితములో శతృవులు కూడ మితృలుగా మారుతారు శ్రీ సాయి శక్తివలన.

2.  శ్రీ సాయి భక్తుల యింట బరువు బాధ్యతలు అన్నీ సవ్యముగా జరుగుతాయి.

3.  నీవు తినే శాఖాహారములోను మాంసాహారములోను ఉన్నది ఒకేవిధమైన ప్రాణము.   తినేవారి అవసరాలు సౌకర్యాలను బట్టి శాఖాహారము మాంసాహారము నిర్ణయించబడినది.

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



No comments:

Post a Comment